కరెంట్ కోతలతో జనం బేజారు
ABN , Publish Date - Apr 24 , 2024 | 11:37 PM
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంట్ కోతలతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్ పోయినప్పుడల్లా ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తున్నారని బీఆర్ఎస్ నాయ కులు అన్నారు.
- రేపు పాలమూరుకు మాజీ సీఎం కేసీఆర్
- విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు
మహబూబ్నగర్, ఏప్రిల్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంట్ కోతలతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్ పోయినప్పుడల్లా ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తున్నారని బీఆర్ఎస్ నాయ కులు అన్నారు. కేసీఆర్ పాలనలో కరెంట్ కోతల్లేకుండా పరిపాలన అందించా రన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీమంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, సి.లక్ష్మారెడ్డి మాట్లాడారు. గ్రా మాలలో ఎక్కడి కెళ్లినా కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేస్తున్నారని, పొరపా టున ఈ ప్రభుత్వా నికి ఓటు వేసినమని, చాలామంది ఆవేదన చెందుతున్నా రని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కేసీఆర్ జిల్లాకు వస్తున్నారని, ఈ సందర్భంగా పాలమూరులో రోడ్షో, క్లాక్టవర్లో జరిగే సమావేశంలో పాల్గొంటారన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు స్వచ్ఛంధంగా కేసీఆర్ పర్యటనకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు రాజేశ్వర్గౌడ్, ఎంకన్న, శివరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.