Share News

‘పల్లెకు పోదాం’ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 03 , 2024 | 11:35 PM

ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో అమలవు తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజీపీ జిల్లా అఽధ్యక్షుడు పీ. శ్రీనివాస్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

‘పల్లెకు పోదాం’ను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పీ. శ్రీనివాస్‌ రెడ్డి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీ. శ్రీనివాస్‌రెడ్డి

నవాబ్‌పేట, ఫిబ్రవరి 3 : ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో అమలవు తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజీపీ జిల్లా అఽధ్యక్షుడు పీ. శ్రీనివాస్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యర్శి ప్రతాప్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు గవిండ్ల గవిండ్ల రాజు, బుడ్డ, తిరుపతిరెడ్డి, శ్రీకాంత్‌, మండల నాయకులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2024 | 11:35 PM