చీర్యాల్లో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:46 PM
చీర్యాల్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గంగా భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
![చీర్యాల్లో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు](https://media.andhrajyothy.com/media/2024/20240227/27ksr12_6c5174f487.jpg)
కీసర, ఫిబ్రవరి27: చీర్యాల్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గంగా భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే మహత్సోవంలో భాగంగా మంగళవారం రెండవ రోజు ఉదయం గవ్యాంత పూజలు, వాస్తు పూజ, పర్యగ్నికరణం, జలాధివాసం, ప్రధాన దేవతాహోమాలు, నీరాజన తీర్థ ప్రసాదాములు, మండపార్చన, అవాహిత దేవతా హోమాలు, వాస్తుహోమం, రుద్రార్చన నీరాజన మంత్రపుష్పాలతో పాటు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాట్టు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే చామాకూర మల్లారెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీ నారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్, హరిగౌడ్, ఎంపీపీ మల్లారపు ఇందిర, మంజుల తదితరులు పాల్గొన్నారు.