Share News

బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:17 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌,

బీజేపీ గెలుపును ఎవరూ  అడ్డుకోలేరు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

దేశాభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం

మరోసారి మోదీని గెలిపించాలి: కిషన్‌రెడ్డి

బర్కత్‌పుర/రాంనగర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌

ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

ఆదివారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌లోని డీడీ కాలనీలో జరిగిన పలు కాలనీ సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశాభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోదీని గెలిపించాలని ప్రజలను కోరారు. మోదీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. 2040 నాటికి మూడో స్థానమే లక్ష్యంగా ప్రధాని మోదీ రోడ్‌ మ్యాప్‌ తయారు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మోదీ వంటి నాయకుడు ఎంతో అవసరమని.. అలాంటి నాయకుడికి కులాలు, మతాలు, పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల బడ్జెట్‌ ఇచ్చి అభివృద్ధికి సహకరించారని తెలిపారు. జాతీయ రహదారులకు రూ.1.20 లక్షల కోట్లను ఖర్చు చేశారని చెప్పారు. దేశంలో అవినీతి నిర్మూలన జరిగిందన్నారు. సికిందరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించి ఆశీర్వదించాలని కిషన్‌రెడ్డి కోరారు.

Updated Date - Apr 08 , 2024 | 04:18 AM