జీతాలకు డబ్బుల్లేవు.. దయచేసి నిధులివ్వండి
ABN , Publish Date - May 03 , 2024 | 04:34 AM
నిధులు లేక కృష్ణా బోర్డు నిర్వహణ కనాకష్టంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దాంతో బోర్డు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, నిధులు విడుదల చేయాలని తెలంగాణ
![జీతాలకు డబ్బుల్లేవు.. దయచేసి నిధులివ్వండి](https://media.andhrajyothy.com/media/2024/20240428/nn_4c0625d14b.jpg)
తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, మే 2(ఆంధ్రజ్యోతి): నిధులు లేక కృష్ణా బోర్డు నిర్వహణ కనాకష్టంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దాంతో బోర్డు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే లేఖ రాశారు. ఏపీపునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్-86(2) ప్రకారం బోర్డు నిర్వహణకు నిధులు సమకూర్చడం తెలుగు రాష్ట్రాల బాధ్యత అని లేఖలో గుర్తు చేశారు.