కేసీఆర్ రోడ్ షోకు ఆహ్వానం లేదు : భార్గవ్
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:09 AM
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరుబాట బస్సుయాత్రకు తనను ఆహ్వానించలేదని మునిసిపల్ చైర్మన, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తి రునగరు భార్గవ్ అన్నారు.
కేసీఆర్ రోడ్ షోకు ఆహ్వానం లేదు : భార్గవ్
మిర్యాలగూడ, ఏప్రిల్ 24: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరుబాట బస్సుయాత్రకు తనను ఆహ్వానించలేదని మునిసిపల్ చైర్మన, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తి రునగరు భార్గవ్ అన్నారు. బుధవారం కేసీఆర్ పర్యటనకు గంట ముందు ఆయన నివాసంలో 12 మంది మునిసిపల్ కౌన్సిలర్లు, ముఖ్య అనుచరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కేసీఆర్ సభకు ఆహ్వానించనందున రోడ్షోలో పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి తిరునగరు గంగాధర్ కాలం నుంచి కాంగ్రెస్ నేతలతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. వారితో చ నువుగా ఉండటంతో పార్టీ మారుతున్నాననే అపోహతో భాస్కర్రావు తమకు బస్సుయాత్ర గురించి సమాచారం ఇవ్వలేదని ఆ రోపించారు. ఇప్పటి వరకు పార్టీ మారే ఆలోచన చేయలేదన్నారు. పుకార్ల నమ్మి మమ్ముల్ని పార్టీకి దూరం ఉంచడంపై కలత చెందామన్నారు. రెండు రోజుల్లో తమ కార్యకర్తలతో సమావేశమై చర్చించిన అనంతరం భవిష్యత్తు విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో ముసిసిపల్ మాజీ చైర్మన మెరుగు రోషయ్య, ఖాదర్, సోమయ్య, సింగిల్విండో చైర్మన బంటు శ్రీనివాస్, కౌన్సిలర్లు బంటు రమేష్, మాలోతు రాణి, కర్నె ఇందిర, పత్తిపాటి సంజాత, ఉదయ్భాస్కర్, సాధికాబేగం, ఉబ్బపెల్లి వెంకమ్మ, అమృతం దుర్గ, బెల్లం దేవకమ్మ, చీదెళ్ల సత్యవతి, మలగం రమేష్, అబ్దుల్ సలీం, నాయకలు మధు, లింగారెడ్డి, వెంకట్రాములు, దుర్గారావు పాల్గొన్నారు.