TS NEWS: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్వీట్
ABN , Publish Date - Jan 06 , 2024 | 07:31 PM
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్వీట్ చోటు చేసుకుంది. కిడ్నాపర్లతో సురేందర్ సోదరి చేతులు కలిపింది. సురేందర్ సోదరి సహకారంతోనే కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది.
![TS NEWS: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్వీట్](https://media.andhrajyothy.com/media/2023/20231205/RAYA_d0aaff5010.jpg)
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్వీట్ చోటు చేసుకుంది. కిడ్నాపర్లతో సురేందర్ సోదరి చేతులు కలిపింది. సురేందర్ సోదరి సహకారంతోనే కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కొరకు సురేందర్ను సోదరి రాయదుర్గం పిలిపించి కిడ్నాపర్లకు అప్పగించారు. సురేందర్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాపర్లు నల్లమల వైపు తీసుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్నకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు.