దేశవ్యాప్త కులగణన హర్షణీయం : జాజుల
ABN , Publish Date - Apr 08 , 2024 | 03:40 AM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేస్తామనడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్
![దేశవ్యాప్త కులగణన హర్షణీయం : జాజుల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేస్తామనడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్ పేర్కొన్నారు. ఇదే అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ చేర్చడంపై రాహుల్గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ను 50 శాతం పెంచుతామని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపర్చడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయాల వల్ల బీసీల్లో విశ్వాసం మరింత పెరిగిందని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.