రాజ్యసభ సభ్యునిగా నడ్డా ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Apr 07 , 2024 | 03:23 AM
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా శనివారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు అనిల్
తెలంగాణ నుంచి అనిల్కుమార్ యాదవ్..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా శనివారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హాల్లోని ప్రత్యేక రూంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వీరితో పాటు మరో నలుగురు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ సభ్యులుగా మహారాష్ట్ర నుంచి అశోక్రావు శంకర్ రావు చవాన్(అశోక్ చవాన్), రాజస్థాన్ నుంచి చున్నీ లాల్ గరాసియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుస్మితా దేవ్, మహ్మద్ నదిముల్ హక్ ప్రమాణం చేశారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అనిల్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడైన అనిల్ కుమార్ యాదవ్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2015 నుంచి2018 వరకు ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.