చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ
ABN , Publish Date - Mar 11 , 2024 | 11:09 PM
చట్టాలపై ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి సూచించారు.
![చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ](https://media.andhrajyothy.com/media/2024/20240306/2_JCL_11_0977b3a2d9.gif)
జడ్చర్ల, మార్చి 11: చట్టాలపై ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని నసురరుల్లాబా దు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పలు అంశాలపై, చ ట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐ ఆర్, సివిల్, క్రిమినల్ చట్టాల మధ్య తేడాలు, బెయిల్ అంటే ఏమిటి? అనే అం శాలతో పాటు పోక్సో చట్టం, రోడ్డు ప్రమాదాలు, సైబరు క్రైమ్వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడుపరాదని సూచించారు. ఒకవేళ ఏమైనా సమస్యలు ఎదురైతే 1930 నంబరుకు ఫోన్ద్వారా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్, హనుమాన్ సింగ్, రామకృష్ణ, తిమోతి, చామంతి, విద్యార్థులు పాల్గొన్నారు.