Share News

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:16 AM

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఈ నెల 25వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు చేధిం చారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 27: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఈ నెల 25వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు చేధిం చారు. మేళ్లచెర్వు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మండలకేంద్రానికి చెందిన దివ్యాంగుడు వీర గోపయ్య(32) హత్యకు గురయ్యాడు. గోపయ్య భార్య వీరకుమారికి మండలకేంద్రానికి చెందిన సైదా హుస్సేన్‌తో వివాహేతర సంబంఽధం ఉంది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని, ఈ నెల 25వ తేదీ(ఆదివారం అర్ధరాత్రి) ప్రియుడితో కలిసి వీరకుమారి గోపయ్య ముఖానికి దిడ్డు వేసి, గట్టిగా అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనం తరం సహజ మరణంగా చిత్రీకరించింది. బంధువులు, ఒంటి మీద గాయాలు చూసి, అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును చేధించిన కోదాడరూరల్‌ సీఐ రజితారెడ్డి, మేళ్లచెర్వు ఎస్‌ఐ పరమేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు, పోలీసులు, గోపయ్య, శ్రీనివాస్‌లను ఎస్పీ అభినందించారని ఆయన తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 12:16 AM