సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు
ABN , Publish Date - May 15 , 2024 | 11:54 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు చేపడతామని సీ పీఎం రాష్ట్ర కమిటీ సభ్యు లు డబ్బీకార్ మల్లేష్ అ న్నారు.
![సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు](https://media.andhrajyothy.com/media/2024/20240511/15mlg1_e49c686dc3.jpg)
సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు
మిర్యాలగూడ, మే 15: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు చేపడతామని సీ పీఎం రాష్ట్ర కమిటీ సభ్యు లు డబ్బీకార్ మల్లేష్ అ న్నారు. పట్టణంలోని సీపీ ఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పా ర్టీ జిల్లా, మండల కమిటీ కార్యదర్శుల సమావేశం లో ఆయన పాల్గొని మా ట్లాడారు. మే 19న జరిగే పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో సుందరయ్య వర్ధంతి సభలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో 19వ తేదీన నిర్వహించే సభలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసే విధంగా చేపట్టే కార్యాచరణపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని మండల కమిటీ సభ్యులు, శాఖల కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశచంద్ర, మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, శవిధర్రెడ్డి, వినోద్నాయక్, ఆయూబ్, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రాంమూర్తి, ఎండీ అంజద్, రొండి శ్రీనివాస్, జాతంగి సైదులు. జగననాయక్ తదితరులు పాల్గొన్నారు.