Share News

నక్సల్స్‌ బెదిరించినా ఏజెన్సీ అభివృద్ధిని ఆపలేదు

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:47 AM

మావోయిస్టులు ఒకట్రెండుసార్లు తనను చంపుతామని బెదిరించినా పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన తాను ఏ ఒక్కసారీ భద్రాచలం ఏజెన్సీ అభివృద్ధిని ఆపలేదని మంత్రి

నక్సల్స్‌ బెదిరించినా ఏజెన్సీ అభివృద్ధిని ఆపలేదు

ల్యాండ్‌మైన్లు పేల్చినా వెనుకడుగు వేయలేదు: తుమ్మల

దుమ్ముగూడెం ఏప్రిల్‌ 23: మావోయిస్టులు ఒకట్రెండుసార్లు తనను చంపుతామని బెదిరించినా పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన తాను ఏ ఒక్కసారీ భద్రాచలం ఏజెన్సీ అభివృద్ధిని ఆపలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గంగోలులో మంగళవారం మహబూబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో వాజేడు నుంచి చింతూరు వరకు అడవుల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని, రసూల్‌లతో కలిసి తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో తనను అంతం చేసేందుకు మావోయిస్టులు రెండుమూడు సార్లు ల్యాండ్‌మైన్లు పెట్టి నా అవి పేలలేదన్నారు. తనను చంపుతానని బెదిరించినా భయపడలేదన్నా రు. ఏజెన్సీ అభివృద్ధి కోసమే వచ్చా తప్ప దోపిడీకోసం రాలేదని తాను ఆనాడే నిర్భయంగా మావోయిస్టులకు తెగేసి చెప్పానని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ను గెలిపించేందుకకు అన్ని పార్టీలతో పాటు మావోయిస్టులు కూడా సహకరించాలని కోరారు.

Updated Date - Apr 24 , 2024 | 04:47 AM