ఎయిమ్స్లో విశ్రాంత సైనికులకు వైద్య సేవలు
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:25 AM
బీబీనగర్ ఎయిమ్స్లో విశ్రాంత సైనికులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్టు విశ్రాంత సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు గూడూరు దామోధర్రెడ్డి తెలిపారు.
భువనగిరి టౌన, ఏప్రిల్ 4: బీబీనగర్ ఎయిమ్స్లో విశ్రాంత సైనికులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్టు విశ్రాంత సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు గూడూరు దామోధర్రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరిలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్రాంత సైనికుల అసోసియేషన జాతీయ చైర్మన ఎల్.జగనరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అధ్యక్షుడు నంది పాపిరెడ్డి చేసిన కృషితో ఎయిమ్స్లో విశ్రాంత సైనికులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో దొంతర బోయిన దైవ దినం, శంకరరెడ్డి, బాలేశ్వర్ పాల్గొన్నారు.