మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తాం: సీఎం
ABN , Publish Date - Feb 01 , 2024 | 04:12 AM
సమ్మక్క సారలమ్మ జాతరను ఘనం గా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24
మంత్రి కొండా సురేఖతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క సారలమ్మ జాతరను ఘనం గా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగబోయే జాతర పోస్టర్లను మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జాతర ఏర్పాట్ల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.