Share News

క్యాంపునకు తరలిన మర్రిగూడ ఎంపీటీసీలు

ABN , Publish Date - May 23 , 2024 | 11:59 PM

మర్రిగూడ మండల పరిషత నూతన అధ్యక్షుడి ఎన్నిక శుక్రవారం జరగనుంది.

 క్యాంపునకు తరలిన మర్రిగూడ ఎంపీటీసీలు

క్యాంపునకు తరలిన మర్రిగూడ ఎంపీటీసీలు

నేడు మండల పరిషత అధ్యక్ష పదవి ఎన్నిక

మర్రిగూడ, మే 23: మర్రిగూడ మండల పరిషత నూతన అధ్యక్షుడి ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుగండ్లపల్లి ఎంపీటీసీ గండికోట రాజమణిహరికృష్ణకు మద్దతుగా పలువురు ఎంపీటీసీలు గురువారం హైదరాబాద్‌ క్యాంపునకు తరలివెళ్లారు. మార్చి 30వ తేదీన తాజా మాజీ ఎంపీపీ మెండు మోహనరెడ్డిపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీన నూతన ఎంపీపీ ఎన్నికను నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మర్రిగూడ ఎంపీడీవో ము న్నయ్య 11 ఎంపీటీసీలకు నోటీసులు జారీ చేశారు. అయితే నూ తన ఎంపీపీ బరిలో ఉన్న గండికోట రాజమణిహరికృష్ణకు మరో 6 మంది కాంగ్రె్‌సకు చెందిన ఎంపీటీసీలు మద్దతుగా నిలిచారు. గురువారం రాజమణికి మద్దతుగా ఆమెతో మరో ఆరుగురు కలిసి మొత్తం ఏడుగురు ఎంపీటీసీలు క్యాంపునకు తరలివెళ్లారు. ఏది ఏమైనప్పటికీ నూతన ఎంపీపీ ఎన్నిక గండికోట రాజమణిహరికృష్ణకు సునాయసంగా జరగనుంది.

నేడు నూతన ఎంపీపీ ఎన్నిక: ఎంపీడీవో మున్నయ్య

మర్రిగూడ మండల ఎంపీపీ ఎన్నిక శుక్రవారం ఎంపీడీవో కా ర్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మున్నయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 11మంది ఎంపీటీసీలు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీపీ ఎన్నిక జరగనున్నట్లు ఆ యన తెలిపారు.

Updated Date - May 24 , 2024 | 08:09 AM