మెట్రో ఎండీకి మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానం
ABN , Publish Date - Mar 24 , 2024 | 05:43 AM
హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎ్సరెడ్డికి ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) మేనేజర్ ఆఫ్ ది ఇయర్- 2023-24 అవార్డు లభించింది.
![మెట్రో ఎండీకి మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానం](https://media.andhrajyothy.com/media/2024/20240322/9_NVS_REDDY_7bac8e33b9.jpg)
హైదరాబాద్ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎ్సరెడ్డికి ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) మేనేజర్ ఆఫ్ ది ఇయర్- 2023-24 అవార్డు లభించింది. శుక్రవారం రాత్రి ఆయన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్వీఎ్సరెడ్డి 40 ఏళ్లకు పైగా వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా రాష్ట్రంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పొడవైన మెట్రో ప్రాజెక్టును నగరంలో నిర్మించేందుకు ఎంతో కృషి చేశారని, నిర్మాణ సమయంలో తలెత్తిన సమస్యలను ఆయన సానుకూలంగా పరిష్కరించారన్నారు. మెట్రో స్టేషన్లపై సౌర ఫలకాల ఏర్పాటు ద్వారా ప్రాజెక్టుకు అవసరమైన 12ు విద్యుత్ ఉత్పత్తి చేసి, కర్బన ఉద్గారాలను 3.34 లక్షల టన్నుల వరకు తగ్గించారని తెలిపారు. అలాగే 14.47 కోట్ల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయడం లాంటి వినూత్న కార్యక్రమాలను ఆయన చేపట్టారని ప్రశంసించారు. కార్యక్రమంలో హెచ్ఎంఏ అధ్యక్షుడు జయవంత్ నాయుడు, హెచ్సీయూ వీసీ, ప్రొఫెసర్ బీజే రావు, మిస్సైల్, స్ట్రాటజిక్ సిస్టమ్ డైరెక్టర్ జనరల్ రాజాబాబు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.