Share News

నలుగురిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు

ABN , Publish Date - May 30 , 2024 | 11:40 PM

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన నలుగురు విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీసింగ్‌ కేసులు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష కొనసాగుతున్న సమయంలో మర్పల్లి పరీక్షా కేంద్రాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 నలుగురిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు

వికారాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన నలుగురు విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీసింగ్‌ కేసులు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష కొనసాగుతున్న సమయంలో మర్పల్లి పరీక్షా కేంద్రాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో చూచిరాతకు పాల్పడిన నలుగురు విద్యార్థులపై వారు మాల్‌ ప్రాక్టీసింగ్‌ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, ఉదయం జరిగిన ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 2678 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2524 మంది హాజరు కాగా, 154 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1236 మంది విద్యార్థులకు 1167 మంది హాజరు కాగా, 69 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - May 30 , 2024 | 11:40 PM