ఎమ్మెల్సీలుగా మహేశ్గౌడ్, వెంకట్ ప్రమాణం
ABN , Publish Date - Feb 01 , 2024 | 04:10 AM
ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఏకగ్రీవంగా ఎన్నికైన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బుధవారం
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఏకగ్రీవంగా ఎన్నికైన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన చాంబర్లో వారితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్గౌడ్, వెంకట్ను వారు అభినందించారు.