తాండూరు - వికారాబాద్ రోడ్డుకు మహర్దశ
ABN , Publish Date - Jul 19 , 2024 | 11:42 PM
తాండూరు - వికారాబాద్ రోడ్డు డబుల్లైన్ రోడ్డుగా మారనుంది. ఇందుకు గాను రూ. 100కోట్లతో పనులు చేపట్టానున్నారు.
రూ. 100కోట్లతో డబుల్ లైన్కు ప్రతిపాదనలు
ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు
27న రోడ్డు పనులకు మంత్రిచే శంకుస్థాపన
మెరుగు పడనున్న రవాణా వ్యవస్థ
తాండూరు, జూలై 19: తాండూరు - వికారాబాద్ రోడ్డు డబుల్లైన్ రోడ్డుగా మారనుంది. ఇందుకు గాను రూ. 100కోట్లతో పనులు చేపట్టానున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చేసిన రివైజ్డ్ ఎస్టిమెంట్ తయారు చేశారు. కాగా తాండూరు - వికారాబాద్ డబుల్రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ. 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మరో రూ. 50కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు. దీంతో వంద కోట్లతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుం మిగతా నిధులకు సంబంధించిన ప్రాతిపదనలు ఆర్అండ్బి చీఫ్ ఇంజనీర్ నుంచి ఆర్థిక శాఖ అనుమతి కోసం వెళ్లింది. రెండు మూడు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్గంలో ప్రతి రోజు మూడు వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రోడ్డు తరుచు గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. అధిక లోడ్తో నాపరాళ్లు , సుద్ద, సిమెంట్ వాహనాలు వెళ్తుండటంతో రోడ్డు గుంతలమయమౌతుంది. వానాకాలంలో ఇబ్బందులు రాకుండా ఉండేలా స్వయంగా స్పీకర్ ప్రసాద్కుమార్, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పనులకు మోక్షం కలగనుంది. అయితే ఈ నెల 27న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు తేదీ ఖరారు చేశారు.