Share News

రాష్ట్ర ఫైనాన్స్‌ కమిటీ సభ్యులుగా ఎం.రమేష్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:00 AM

నామినేట్‌ పదవులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వికారాబాద్‌ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ మహరాజుకు రాష్ట్ర స్థాయి పదవి వరించింది.

రాష్ట్ర ఫైనాన్స్‌ కమిటీ సభ్యులుగా ఎం.రమేష్‌

తాండూరు, ఫిబ్రవరి 16: నామినేట్‌ పదవులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వికారాబాద్‌ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ మహరాజుకు రాష్ట్ర స్థాయి పదవి వరించింది. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌గా రమేష్‌ను నియమించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా రాజయ్యను నియమించగా కమిటీ సభ్యులుగా ఎం.రమేష్‌, సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌లను నియమించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక తాండూరు కు మొట్టమొదటి నామినేటేడ్‌ పోస్ట్‌ దక్కింది.

Updated Date - Feb 17 , 2024 | 12:00 AM