1న మాలల సింహగర్జన
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:32 AM
ఎ స్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబరు 1వ తేదీన హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జి ల్లా చైర్మన గోలి సైదులు పి లుపునిచ్చారు.
1న మాలల సింహగర్జన
నల్లగొండ క్రైం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎ స్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబరు 1వ తేదీన హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జి ల్లా చైర్మన గోలి సైదులు పి లుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ అతిథిగృహంలో ఆదివారం సింహగర్జన పోస్టర్లను వారు ఆవిష్కరించి మా ట్లాడారు. సుప్రీం కోర్టు సూచనకు అనుకూలంగా దళితులను విడదీసి మనువాదుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స తె చ్చి అమలుచేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు పునరాలోచన చేయాలని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే సింహగర్జనకు మాలలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చే యాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని అన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మనువాదులకు సపోర్టు చేస్తున్న మంద కృష్ణమాదిగ మనువాదాన్ని వీడి దళితులుగా మనం ఒకటి కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అద్దంకి రాంకోటి, రేకల సైదులు, బోగరి విజయ్, తెల్గమల్ల యాదగిరి, గాలి రవికిషన, చింతమల్ల రమేష్, కూన యాదగి రి, తెల్గమల్ల రవీందర్, గాలి వెంకటేశ్వర్లు, ఈసారం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.