Kumaram Bheem Asifabad- ఎయిడ్స్ను పారదోలుదాం
ABN , Publish Date - May 19 , 2024 | 11:04 PM
యిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం సందర్ఢంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
![Kumaram Bheem Asifabad- ఎయిడ్స్ను పారదోలుదాం](https://media.andhrajyothy.com/media/2024/20240511/05asf_P19_c0ae43eaad.gif)
ఆసిఫాబాద్ రూరల్, మే 19: ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం సందర్ఢంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ, సంఘీభావంతో, గతం నేర్పిన పాఠాలతో బంగారు భవిత నిర్మిద్దామని, హెచ్ఐవీ పరిధిని దాటి ఆరోగ్యవంతంగా జీవిద్దామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ సుధాకర్నాయక్, డాక్టర్ వినోద్, సీఎస్ఓ రాజేఝ్, డీఎండీఓ సంతోష్, ఐసీటీసీ కౌన్సిలర్ సతీష్,హరీష్, రవీందర్,రఫి, రాజవేఖర్, చేతన స్వచ్చంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సతీష్, సాయిమహిళా మండలి ప్రాజెక్టు మేనేజర్ సునీల్ పాల్గొన్నారు.