Share News

ఓట్లు వేయిద్దాం.. కోట్లు తెచ్చుకుందాం: వీరేశం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:23 AM

కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామ ల కిరణ్‌కుమార్‌రెడ్డికి గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్దికి కోట్లు తె చ్చుకుందామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

 ఓట్లు వేయిద్దాం.. కోట్లు తెచ్చుకుందాం: వీరేశం
చిట్యాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీరేశం

ఓట్లు వేయిద్దాం.. కోట్లు తెచ్చుకుందాం: వీరేశం

నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూరు, ఏప్రిల్‌ 19: కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామ ల కిరణ్‌కుమార్‌రెడ్డికి గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్దికి కోట్లు తె చ్చుకుందామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్‌పల్లి, చిట్యాలలో శుక్రవారం నిర్వహించిన పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆ యన పాల్గొని మాట్లాడారు. భువనగిరి ఎంపీ ని యోజకవర్గ పరిధిలోని నకిరేకల్‌లో రికార్డు మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు చాలెంజ్‌గా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మె జార్టీ తెచ్చుకోవడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా రాణించవచ్చని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం ఆరాట పడుతున్నాయని అ న్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, బీజేపీకి కనీసం బూత కమిటీ సభ్యులు లేరని బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం పోరాడుతుందన్నారు. పదేళ్లలో బీజేపీ దేశానికి చే సిందేమీ లేదని, ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ పథకాలను వివరించి ఓట్లు అడగాలని కోరారు. నార్కట్‌పల్లిలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఇనచార్జి వెంకటరమణ, మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య, నాయకులు బండా సాగర్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, పాశం శ్రీనివా్‌సరెడ్డి, సట్టు సత్తయ్య, ఐతరాజు యాదయ్య, నేతకాని కృష్ణయ్య, వడ్డే భూపాల్‌రెడ్డి, కొంపెల్లి సైదులు, జెరిపోతుల భరత, గాయం శ్యాంసుందర్‌రెడ్డి, ప్రజ్ఞాపురం సత్తి, చింత శరత, చిట్యాలలో మునిసిపల్‌ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాయకులు గుడిపాటి లక్ష్మీనర్సు, పోకల దేవదాస్‌, జడల చినమల్లయ్య, కాటం వెంకటేశం, ఎద్దులపురి కృష్ణ, శేపూరి యాదయ్య, పరమేశం పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వీరేశం అ న్నారు. కట్టంగూరులో శుక్రవారం జరిగిన ఎన్నికల సన్నాహక స మావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వచ్చిన మెజార్టీ కంటే ఎంపీ ఎన్నికల్లో ఎ క్కువ వచ్చేందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. స మావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, ఎంపీపీ జెల్లా ముత్తిలింగం, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, రెడ్డిపల్లి సాగర్‌, లింగస్వామి, జెజవాడ సై దులు, గడుసు సుధీర్‌రెడ్డి, వల్లపు శ్రీనివా్‌సరెడ్డి, బూరుగు శ్రీను, ధార భిక్షం, పెద్ది యాదగిరి, మిట్టపల్లి శివశంకర్‌, పాలడుగు హ రికృష్ణ, నర్సింహ, స్వామి, వెంకన్న, చంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:23 AM