ఇస్తేమా సభల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:08 PM
పరిగి మునిసిపల్ పరిధిలోని న్యామత్నగర్లో 6,7.8 తేదీల్లో నిర్వహిస్తున్న సుబాయి దీని ఇజ్తెమ (ఇస్తేమా) సభల ఏర్పాట్లను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, టీపీసీసీ అధికారి ప్రతినిధి ఫిరోజ్ఖాన్ శుక్రవారం పరిశీలించారు.
![ఇస్తేమా సభల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/05_PRG_17_024869f206.jpg)
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
పరిగి, జనవరి5: పరిగి మునిసిపల్ పరిధిలోని న్యామత్నగర్లో 6,7.8 తేదీల్లో నిర్వహిస్తున్న సుబాయి దీని ఇజ్తెమ (ఇస్తేమా) సభల ఏర్పాట్లను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, టీపీసీసీ అధికారి ప్రతినిధి ఫిరోజ్ఖాన్ శుక్రవారం పరిశీలించారు. విద్యుత్, మిషన్భగీరథ, మునిసిపల్ అధికారులతో మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే సభలకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూడాలని అధికారులకు సూచించారు. నీటిసరఫరా, విద్యుత్ సరఫరాతో పాటు భోజనాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. వాహనాలకు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసే విధంగా చూడాలని సూచించారు. పోలీస్ కంట్రోల్ రూం నుంచి బందోబస్తుతో పాటు, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు వాజిద్, సాహేద్ తదితరులు ఉన్నారు.