Share News

జేబీబీ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:15 AM

జనిపల్లి శ్రీనివాసరావు(కోడికత్తి శ్రీను) రాజకీయ రంగప్రవేశం చేశారు. సోమవారం ఆయన జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీలో చేరారు. విజయవాడలోని ఆ పార్టీ

జేబీబీ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను

అమలాపురం నుంచి ఎన్నికల బరిలోకి...

విజయవాడ(ఆంధ్రజ్యోతి), ముమ్మిడివరం, మార్చి 11: జనిపల్లి శ్రీనివాసరావు(కోడికత్తి శ్రీను) రాజకీయ రంగప్రవేశం చేశారు. సోమవారం ఆయన జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీలో చేరారు. విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక పెదపేటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో సామాన్యులకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం సాగిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా అవి సక్రమంగా అర్హులకు చేరడం లేదన్నారు. అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

Updated Date - Mar 12 , 2024 | 11:27 AM