Share News

ఖమ్మం ఎంపీ టికెట్‌ నాకే ఇవ్వాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:47 AM

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ సీటు తనకే ఇవ్వాలని పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు(వీహెచ్‌) కోరారు.

ఖమ్మం ఎంపీ టికెట్‌ నాకే ఇవ్వాలి

సీఎం రేవంత్‌ను కలిసి ఇదే విషయం చెప్పా: వీహెచ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ సీటు తనకే ఇవ్వాలని పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు(వీహెచ్‌) కోరారు. ఇటీవలే సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి, ఖమ్మం టికెట్‌ ఇవ్వాలని కోరానని తెలిపారు. ఖమ్మం టికెట్‌ తనకు ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్‌ గాంధీతో కలిసి ఖమ్మంలో తిరిగిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. అయితే, పార్టీ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసలు సూత్రధారితోపాటు ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరినీ బయటికి లాగాలన్నారు. అలాగే గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసును మళ్లీ రీ ఓపెన్‌ చేయాలని సూచించారు. సుమారు రూ.2500 కోట్ల ఆస్తులు, భూములను నయీం ఆక్రమించాడని, అవన్నీ పేదలకు పంచాలని కోరారు. .

Updated Date - Apr 03 , 2024 | 08:15 AM