Share News

వచ్చే వారం జస్టిస్‌ చంద్రఘోష్‌ మేడిగడ్డ పర్యటన!

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:09 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వచ్చే వారం మొదట్లో జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని విచారణ బృందం పరిశీలించనున్నట్టు తెలిసింది

వచ్చే వారం జస్టిస్‌ చంద్రఘోష్‌ మేడిగడ్డ పర్యటన!

భూపాలపల్లి, ఏప్రిల్‌ 26: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వచ్చే వారం మొదట్లో జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని విచారణ బృందం పరిశీలించనున్నట్టు తెలిసింది.

విచారణ బృందం శుక్ర, శనివారాల్లో ఈ బ్యారేజీలను పరిశీలించేందుకు రానున్నట్లు వార్తలొచ్చాయి. అయితే బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించారు.

ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బ్యారేజీలను సందర్శించాల్సి ఉన్నా సమయాభావం వల్ల వాయిదా వేసుకున్నారు. అధికారుల నుంచి అన్ని రకాల సమాచారాన్ని తీసుకున్నాక వచ్చే వారం మొదట్లో బ్యారేజీలను సందర్శించనున్నారని తెలిసింది. దెబ్బతిన్న మేడిగడ్డ ఏడో బ్లాకులోని మూడు పియర్లను పరిశీలించడంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలను అధ్యయనం చేసి సంబంధిత బాధ్యులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Apr 27 , 2024 | 10:14 AM