Share News

Kumaram Bheem Asifabad- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:31 PM

జిల్లాలోని వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రహెమాన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Kumaram Bheem Asifabad-  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
మాట్లాడుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రహెమాన్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 12: జిల్లాలోని వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రహెమాన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలిచాలని వేతనాలతో జర్నలిస్టులు సామాజిక సేవ దృక్పథంతో పని చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉండి పోరాడితేనే హక్కులు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు ఎస్‌ వేణుగోపాల్‌, ప్రకాష్‌గౌడ్‌, సతీష్‌, కృష్ణంరాజు, సురేష్‌, నవీన్‌గౌడ్‌, చంద్రకాంత్‌, బిక్కాజీ, రమేశ్‌, హన్నన్‌, రమేశ్‌, రాధేశ్యాం, శ్రీనివాస్‌, రాంచందర్‌, తారు, నితేష్‌, మిలిన్‌కమార్‌, నౌషాద్‌, రఫిక్‌, శివ, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 10:31 PM