Share News

కంపుకొడుతోంది

ABN , Publish Date - May 14 , 2024 | 11:28 PM

కొండమల్లేపల్లి ఆర్టీసి బస్టాండు దుర్వాసనతో కంపుకొడుతోంది. మరుగుదొడ్డి లీకేజీతో ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై నిత్యం రద్దీగా ఉండే కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండుకు ఆదాయం ఉన్నా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

 కంపుకొడుతోంది
దుర్వాసనతో ముక్కు మూసుకున్న ప్రయాణికులు

కంపుకొడుతోంది

అధ్వానంగా కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌

మరుగుదొడ్డి లీకేజీతో దుర్వాసన

దుర్వాసనతో ప్రయాణికుల ఇబ్బందులు

ఆదాయం ఉన్నా పట్టించుకోని అధికారులు

కొండమల్లేపల్లి, మే 14: కొండమల్లేపల్లి ఆర్టీసి బస్టాండు దుర్వాసనతో కంపుకొడుతోంది. మరుగుదొడ్డి లీకేజీతో ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై నిత్యం రద్దీగా ఉండే కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండుకు ఆదాయం ఉన్నా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని పలుమార్లు ఆర్టీసీ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆర్టీసీ బస్సులు సైతం ఈ వైపుగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. తెలుగు రాషా్ట్రల ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండే బస్టాండులో మౌలిక సదుపాయాలు మాత్రం నామమాత్రమని ప్రయాణికులు వాపోతున్నారు. మరుగుదొడ్డి లీకేజీ అయి దుర్వాసన వస్తున్నా సంబంధిత ఆర్టీసీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

Updated Date - May 14 , 2024 | 11:28 PM