Share News

ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:43 PM

సాగులో ఆధునిక, సాంకేతిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ఆధునిక  పద్ధతుల్లో సాగు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, రైతులు,

మంత్రి పొన్నం ప్రభాకర్‌

మూడుచింతలపల్లి, మార్చి6 : సాగులో ఆధునిక, సాంకేతిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 110 మంది రైతులకు శ్రవణ, దృశ్య విధానంలో అవగాహన కల్పించేందుకు మూడుచింతలపల్లి రైతు వేదికగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాగులో రైతులకు సాగులో ఆధునిక, సాంకేతిక విధానాలపై అవగాహన, ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ అఖిలే్‌షరెడ్డి, జిల్లా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ మేరీరేఖ, ఏడీఏ వెంకట్‌రాంరెడ్డి, వజ్రే్‌షయాదవ్‌, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:43 PM