ధ్రువపత్రాల జారీ సులభతరం
ABN , Publish Date - May 20 , 2024 | 11:37 PM
మీ సేవల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలను ఇక నుంచి సులభంగా జారీ చేయడానికి అవసరమైన మార్పులు చేయడం జరుగుతుందని మీ సేవ కమిషనర్ రవికిరణ్ పేర్కొన్నారు.
![ధ్రువపత్రాల జారీ సులభతరం](https://media.andhrajyothy.com/media/2024/20240511/20mdcl3_5856cf6968.jpg)
మీ -సేవ కమిషనర్ రవికిరణ్
మేడ్చల్ మే 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మీ సేవల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలను ఇక నుంచి సులభంగా జారీ చేయడానికి అవసరమైన మార్పులు చేయడం జరుగుతుందని మీ సేవ కమిషనర్ రవికిరణ్ పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండల పరిధిలో మీ సేవ ద్వారా వివిధ ధ్రువపత్రాలు జారీ చేసే ప్రక్రియలో సమస్యలను తహసీల్దార్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ధ్రువపత్రాలను సులభతరంగా జారీ చేయడానికి మార్పులు, చేర్పులు చేయడం జరుగుతుందన్నారు. కాగా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపఽథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు తక్షణమే ఉత్తర్వులను అమలు చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల ద్వారా నిర్వహించే ఉత్తర, ప్రత్యుత్తరాలలో టీఎ్సకు బదులుగా టీజీని రాయాలని ఆయన సూచించారు. కార్యక్రమల్లో అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ పాల్గొన్నారు.