Share News

భట్టి దృష్టికి సింగరేణి ఉద్యోగాల స్థానికత సమస్య

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:49 AM

సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన స్థానికత అంశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు

భట్టి దృష్టికి సింగరేణి ఉద్యోగాల స్థానికత సమస్య

కరీంనగర్‌ నుంచి సిద్దిపేట జిల్లాలో కలిసిన మండలాలకు న్యాయం చేయాలన్న పొన్నం

హుస్నాబాద్‌, మార్చి 11: సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన స్థానికత అంశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు సింగరేణి స్థానికత కిందకు వస్తాయని, అయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం వల్ల ఇవి హైదరాబాద్‌ జోన్‌లోకి వెళ్లడంతో సింగరేణి ఉద్యోగాలకు ఆయా మండలాల వారు స్థానికత కోల్పోయారని భట్టికి వివరించినట్టు చెప్పారు. దీంతో ఈ మండలాల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎంకు చెప్పగా.. ఆయన సానుకూలంగా స్పందించి సింగరేణి సీఎండీతో మాట్లాడారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 03:49 AM