నేతన్నల బతుకులు మారాలంటే మోదీ రావాలి
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:44 PM
నేత కార్మికుల బతుకులు మారాలంటే మరోసారి కేంద్రంలో మోదీ ప్రభు త్వం రావాలని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర న ర్సయ్యగౌడ్ అన్నారు.
![నేతన్నల బతుకులు మారాలంటే మోదీ రావాలి](https://media.andhrajyothy.com/media/2024/20240407/12_GTPL_2_866251f0b5.jpg)
నేతన్నల బతుకులు మారాలంటే మోదీ రావాలి
భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి నర్సయ్యగౌడ్
గట్టుప్పల్, చండూరు, చిట్యాల, ఏప్రిల్ 12: నేత కార్మికుల బతుకులు మారాలంటే మరోసారి కేంద్రంలో మోదీ ప్రభు త్వం రావాలని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర న ర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత భరోసా యాత్ర శుక్రవారం జిల్లాలో ని గట్టుప్పల్, చండూరు, చిట్యాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని భరోసా కల్పించారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని, చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయి న వస్త్ర నిల్వలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేనే త సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా గత ప్రభు త్వం నిర్వీర్యం చేసిందన్నారు. కార్మికులు తయారు చేసిన వసా్త్రనికి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వంతో పా టు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని అన్నారు. చేనేత కార్మికులకు సవాలుగా మారిన ప్రింటెడ్ డిజైన్లను అరికట్టాల్సిన బా ధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చేనేత సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గతంలో ఈ ప్రాంత ఎంపీగా ఉండి ఎయిమ్స్, కేంద్రీయ విశ్వవిద్యాల యం, ఎంఎంటీఎస్, పాస్పోర్టు కార్యాలయం, జాతీయ రహదారుల విస్తరణ, దండుమల్కాపురంలో ఇండస్ర్టీయల్ పార్కు వం టి అభివృద్ధి పనులను తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమం లో నాయకులు కర్నాటి ధనంజయ, దోనూరి వీరారెడ్డి, దూడల బిక్షంగౌడ్, కంప దుర్గయ్య, యెన్నేం శివకుమార్, చిలువేరు దుర్గ య్య, రాపోలు గోపీనాథ్, తిరందాస్ ఆంజనేయులు, భీమగాని జంగయ్య, కొంగరి గణేష్, రాపోలు మార్కండేయ, తిరందాస్ చంద్రమౌళి, పాండు, శంకర్, నరహరి, శంకర్ పాల్గొన్నారు.