Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు భారీ భద్రత

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:30 PM

రామోజీరావు మరణంతో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు భారీ భద్రత

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 8: రామోజీరావు మరణంతో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రామోజీరావు మరణ వార్త విన్న చంద్రబాబు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా చంద్రబాబుకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కానున్న నేపథ్యంలో ఆయనకు భద్రతను పెంచారు. చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి తన కుటుంబ సభ్యులతో నేరుగా రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు మొదటిసారి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు.

Updated Date - Jun 08 , 2024 | 11:30 PM