Share News

భారీగా బంగారం పట్టివేత

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:50 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వివిధ దేశాల నుంచి ప్రయాణికులు ఫిబ్రవరి నెలలో అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా బంగారం పట్టివేత
ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ బంగారం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముగ్గురి నుంచి రూ.6.03కోట్ల విలువైన గోల్డ్‌ స్వాధీనం

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 4: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వివిధ దేశాల నుంచి ప్రయాణికులు ఫిబ్రవరి నెలలో అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... గత ఫిబ్రవరిలో దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళా ప్రయాణికులను తనిఖీ చేయగా వారి వద్ద 13.61కిలోల బంగారం పట్టుబడిందన్నారు. ఈ బంగారం విలువ రూ.6.03కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నిందితులు పొట్టలో, లోదుస్తుల్లో, మెర్క్యురీ కోటింగ్‌, చైన్స్‌ రూపంలో బంగారాన్ని తరలించేందుకు యత్నించారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

Updated Date - Mar 04 , 2024 | 10:50 PM