Share News

ఘనంగా గోదాదేవి నోము

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:03 PM

ఎదులాబాద్‌ గోదాసమేత శ్రీ మన్నార్‌ రంగనాయకస్వామి ధనుర్మాసవ్రత పూజలు గోదాదేవి నోముతో ముగిశాయి. పండితులు మంగళవారం రాత్రి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

ఘనంగా గోదాదేవి నోము
అమ్మవారికి అభిషేకం చేస్తున్న పండితులు

ముగిసిన ధనుర్మాసవ్రత పూజలు

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి17: ఎదులాబాద్‌ గోదాసమేత శ్రీ మన్నార్‌ రంగనాయకస్వామి ధనుర్మాసవ్రత పూజలు గోదాదేవి నోముతో ముగిశాయి. పండితులు మంగళవారం రాత్రి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. గోదాదేవిని పల్లకీలో ఊరేగించారు. అనంతరం కల్యాణ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా ఆలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని కోలాటం ఆడారు. శ్రీమన్నారాయణ నామస్మరణతో ఆలయప్రాంగణమంత మార్మోగింది. అమ్మవారికి నోము నిర్వహించి ధనుర్మాసవ్రత పూజలను ముగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయధర్మకర్తలు టీపీ లక్ష్మణాచార్యులు, గోవిందాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలచార్యులు, సేనామాచార్యులు, పురుషోత్తచార్యులు, పవనాచార్యులు, అచ్యుతాచార్యులు, హరికృష్ణాచార్యులు, అధిత్యచార్యులు, శ్రీవాస్తవాచార్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:03 PM