Share News

పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : బీర్ల

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:11 AM

: పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు.

పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : బీర్ల
వీధి లైట్లు ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, జనవరి 16: పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. గుట్ట మునిసిపాలిటీలోని 4వ వార్డులో ఏర్పాటు చేసిన వీధిలైట్లను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైట్ల ఏర్పాటుతో ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగు పడుతోందని, ఎలాంటి ప్రమాదాలు జరగవని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, స్థానిక కౌన్సిలర్‌ సీస విజయలక్ష్మీకృష్ణాగౌడ్‌, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణీభతర్‌గౌడ్‌, ముక్కెర్ల మల్లేష్‌యాదవ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కాటబత్తిని ఆంజనేయులు, నాయకులు వంగపల్లి అరుణ్‌కుమార్‌, మోలుగు శ్రీరాములు, సయ్యద్‌ సలీం పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:11 AM