పాలన చేత కాకపోతే దిగిపోండి: ప్రవీణ్ కుమార్
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:35 AM
హైదరాబాద్ శివారులోని జన్వాడలో బీజేపీ, ఆర్ఎ్సఎస్, కాంగ్రెస్ గూండాలు చర్చిని ధ్వంసం చేసి, అడ్డు వచ్చిన దళితులపై దాడికి పాల్పడ్డారని బీఎస్పీ
![పాలన చేత కాకపోతే దిగిపోండి: ప్రవీణ్ కుమార్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్,ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని జన్వాడలో బీజేపీ, ఆర్ఎ్సఎస్, కాంగ్రెస్ గూండాలు చర్చిని ధ్వంసం చేసి, అడ్డు వచ్చిన దళితులపై దాడికి పాల్పడ్డారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజాపాలన అంటే ఇదేనా.. అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పాలన చేత కాకపోతే దిగిపోవాలని, దళితులను కాపాడుకునేందుకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.