స్పీకర్ ప్రచారం చేస్తున్నారు...: ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:51 AM
కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న గడ్డంప్రసాద్ ప్రచారం చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని బీజేపీ నేతలు ఎన్నికల
హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న గడ్డంప్రసాద్ ప్రచారం చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీ నేతలు ప్రేమేందర్రెడ్డి, కె.మాధవి, ఆర్.వి.పవన్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికా్సరాజ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్రేమేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... స్పీకర్ గడ్డం ప్రసాద్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, రంజిత్రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారని పేర్కొన్నారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డులను, ఫోటోను సీఈవోకు అందించినట్లు తెలిపారు.