పాడి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలి
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:40 AM
వ్యవసాయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న పాడిపరిశ్రమ రైతులకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ సభ్యుడు జీవన్రెడ్డి కోరారు.
![పాడి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
\శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న పాడిపరిశ్రమ రైతులకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ సభ్యుడు జీవన్రెడ్డి కోరారు. సోమవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనలో భాగంగా జీవన్రెడ్డి పాడి రైతులను ఆదుకోవాలన్నారు. గత ప్రభుత్వం పాలకు లీటర్కు ప్రోత్సాహకంగా రూ.4 చొప్పున అందించనున్నట్టు ప్రకటించి.. కేవలం విజయ డైరీ పరిధిలోని రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందన్నారు. నల్లగొండ, కరీంనగర్ ప్రాంత పాడి రైతులకు ప్రోత్సాహకం అందలేదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని పాడి రైతులకు ఉచిత విద్యుత్తుతో పాటు పాల ఉత్పత్తులపై లీటర్కు రూ.5 చొప్పున ప్రోత్సాహకాలను అందించాలని కోరారు.