బ్యూటీపార్లర్ పేరుతో మోసం
ABN , Publish Date - Jan 30 , 2024 | 03:26 AM
బ్యూటీపార్లర్ పేరుతో ఆకర్షించారు. ఫ్రాంచైజీలిస్తామంటూ ముగ్గులోకి దింపారు. చివరికి అక్క, బావ, మరదలు కలిసి బ్యూటీపార్లర్ పేరుతో మూడు కోట్లు వసూలు చేసి బాధితులను నిండాముంచి పరారయ్యారు.
![బ్యూటీపార్లర్ పేరుతో మోసం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఫ్రాంచైజీలంటూ రూ.3 కోట్లు వసూలు
నిజాంపేట్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): బ్యూటీపార్లర్ పేరుతో ఆకర్షించారు. ఫ్రాంచైజీలిస్తామంటూ ముగ్గులోకి దింపారు. చివరికి అక్క, బావ, మరదలు కలిసి బ్యూటీపార్లర్ పేరుతో మూడు కోట్లు వసూలు చేసి బాధితులను నిండాముంచి పరారయ్యారు. ప్రగతినగర్లో నివాసముండే సమీర, ఇస్మాయిల్ దంపతులు, సమీరా చెల్లెలు జెస్సికా కలిసి రోజ్ గోల్డ్ బ్యూటీపార్లర్ పేరుతో యూట్యూబ్లో యాడ్స్ చేసి అమాయకుల దృష్టిని ఆకర్షించారు. తమ పార్లర్ ఫ్రాంచైజీకి ఇస్తామని, నెలకి రూ. 35వేలు జీతం కూడా ఇస్తామని మాయ మాటలు చెప్పి నమ్మించారు. వీరి మాటలు నమ్మిన కొందరు మహిళలు మంగళసూత్రాలు అమ్మి మరి ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఇలా వసూలు చేసిన సొమ్ముతో వారు పరారయ్యారు. బాధితులు సోమవారం బాచుపల్లి పోలీసుస్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.