బీజేపీతో పొత్తున్నా.. ‘మల్కాజిగిరి’ మాదే
ABN , Publish Date - Feb 17 , 2024 | 03:59 AM
‘బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే.. మా పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ.. బండి సంజయ్ ఎందుకంటారు. ఆయనవి మాటలే తప్ప ఆయనతో అయ్యేది లేదు..
![బీజేపీతో పొత్తున్నా.. ‘మల్కాజిగిరి’ మాదే](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బండిసంజయ్తో అయ్యేదిలేదు.. పొయ్యేదిలేదు:మల్లారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే.. మా పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ.. బండి సంజయ్ ఎందుకంటారు. ఆయనవి మాటలే తప్ప ఆయనతో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తున్నా.. మల్కాజిగిరి ఎంపీ టికెట్ మాదే’’ అని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై హాట్ కామెంట్స్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ భద్రంగా ఉందని పేర్కొన్నారు. ‘‘నా కుమారునికి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం తగదు. మా అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కుటుంబం వేరు. మా కుటుంబం వేరు. అందరినీ కలిపి కుటుంబం అని అనడం సరికాదు’’ అని అభిప్రాయపడ్డారు. అదే విధంగా తన వర్సిటీలలో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని, కావాలని తనపై కక్ష సాధించాలనుకుంటే ఏమీ చేయలేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.