Share News

ఎరువులను ఈ మిషన ద్వారా విక్రయించాలి

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:15 AM

ఎరువుల దుకాణ యజమానులు ఈ పాస్‌ మిషన ద్వారా ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ సూచించారు.

 ఎరువులను ఈ మిషన ద్వారా విక్రయించాలి
ఎరువుల షాపులను తనిఖీ చేస్తున్న డీఏవో శ్రవణ్‌కుమార్‌

ఎరువులను ఈ మిషన ద్వారా విక్రయించాలి

జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్‌

నకిరేకల్‌, జనవరి 27: ఎరువుల దుకాణ యజమానులు ఈ పాస్‌ మిషన ద్వారా ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ సూచించారు. నకిరేకల్‌లోని ఎరువుల దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అ ధికారి డి.మల్లేష్‌, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:15 AM