Share News

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:39 PM

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు పొలంలోనే ప్రాణాలు వదిలాడు.

 విద్యుదాఘాతంతో రైతు మృతి
కృష్ణారెడ్డి(ఫైల్‌)

విద్యుదాఘాతంతో రైతు మృతి

నార్కట్‌పల్లి, జూన 9: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు పొలంలోనే ప్రాణాలు వదిలాడు. ఆదివారం నార్కట్‌పల్లి మండలం బెండల్‌పహాడ్‌లో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెండల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన యానాల కృష్ణారెడ్డి (58) అదే గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన సుమారు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆ పొలంలో ఉన్న బోరు మోటారుకు మరమ్మతులు చేయించాడు. ఆదివారం ట్రాన్సఫార్మర్‌ వద్దకు వెళ్లిన కృష్ణారెడ్డి ప్రమాదవశాత్తు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కృష్ణారెడ్డి కుమారుడు యానాల జానరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని నల్లగొండ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు.

Updated Date - Jun 09 , 2024 | 11:39 PM