పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:41 PM
వచ్చే నెల 13న జరిగే పార్లమెం టు ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ టి.పూర్ణచంద్ర అన్నా రు.
పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ టి.పూర్ణచంద్ర
కట్టంగూరు, ఏప్రిల్ 25: వచ్చే నెల 13న జరిగే పార్లమెం టు ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ టి.పూర్ణచంద్ర అన్నా రు. కట్టంగూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని గు రువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలకు, సూ పర్వైజర్లకు, సెక్టార్ అధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల కు స్లిపుల పంపిణీతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన వసతులు గురించి వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని రకాల వసతు లు కల్పించాలని, వసతులు కల్పించనట్లయితే సంబంధిత స్థానిక అధికారులదే బాధ్యత అన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ పూల బోకేతో అధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమం లో తహసీల్దార్ గుగులోతు ప్రసాద్, డీటీ సుకన్య, ఆర్ ఐ కుమార్రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.