పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు: రైల్వే
ABN , Publish Date - Apr 04 , 2024 | 04:56 AM
వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో
హైదరాబాద్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి సోమవారం నడుపుతున్న కాచిగూడ- మధురై(07191) రైలును జూన్ 24 వరకు, ప్రతి బుధవారం నడుపుతున్న మధురై- కాచిగూడ(07192), జాల్నా-ఛాప్రా(07651) రైళ్లను జూన్ 26వరకు, ప్రతి శుక్రవారం నడుపుతున్న కాచిగూడ- నాగర్సోల్(07435), హెచ్ఎ్స నాందేడ్- ఈరోడ్(07189), ఛాప్రా-జాల్నా(07652) రైళ్లను జూన్ 28 వరకు, ప్రతి ఆదివారం నడుపుతున్న నాగర్సోల్- కాచిగూడ(07436), ఈరోడ్- నాందేడ్(07190) రైళ్లను జూన్ 30 వరకు పొడిగించినట్లు వారు తెలిపారు.