7 వరకు ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , Publish Date - May 02 , 2024 | 05:07 AM
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ సెట్
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఐసెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పొడిగించారు. రూ.250 రుసుంతో ఈ నెల 17 వరకు, రూ.500 రుసుంతో 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 5, 6వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ నిర్వహించనున్నారు.