షకీల్ కుమారుడి కేసులో మాజీ సీఐకి బెయిల్
ABN , Publish Date - Jan 30 , 2024 | 03:34 AM
హైదరాబాద్ పంజగుట్ట ప్రజాభవన్ వద్ద గత నెలలో కారు బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో అరెస్టయిన బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్కు సోమవారం బెయిల్ లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిజామాబాద్
![షకీల్ కుమారుడి కేసులో మాజీ సీఐకి బెయిల్](https://media.andhrajyothy.com/media/2023/20231205/ff_a4c866b979.jpg)
మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు కోసం గాలింపు
పంజాగుట్ట, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పంజగుట్ట ప్రజాభవన్ వద్ద గత నెలలో కారు బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో అరెస్టయిన బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్కు సోమవారం బెయిల్ లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయికి పారిపోయేందుకు సహకరించారని బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 28న అయన్ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు బెయిలు మంజూరు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకుఐదుగురు అరెస్టు అవగా, పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.