అందరికీ సమాన వేతనం ఇవ్వాలి
ABN , Publish Date - May 09 , 2024 | 05:13 AM
రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా నియమించిన ఉద్యోగుల వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలు ఉన్నాయని, వాటిని సవరించి అందరికీ సమాన వేతనాలు అందించేలా ప్రభుత్వానికి సిఫార్సు
పీఆర్సీకి గ్రూప్-1 అధికారుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా నియమించిన ఉద్యోగుల వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలు ఉన్నాయని, వాటిని సవరించి అందరికీ సమాన వేతనాలు అందించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని గ్రూప్-1 అధికారుల సంఘం పీఆర్సీ కమిషనర్కు విజ్ఞప్తి చేసింది. సంఘం, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో గ్రూప్-1 అధికారుల సంఘం బుధవారం కమిషనర్ శివశంకర్ను కలిసింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్కు అందజేశారు.